9, మే 2012, బుధవారం

గర్భ కవిత్వములో మెలకువలు - 4

ఈ పాఠములో కంద పద్యమును ఎన్ని రకముల పద్యముల గర్భములలో వ్రాయవచ్చునో చూచెదము:

కంద గర్భిత శార్దూలము:

(రామా! ధారుణి నాయక) ప్రముఖ ! సుత్రామార్చితా! లోకనా
థా! (మా మానసమందిరాల మనుమా తండ్రీ!) మముం బ్రోవుమా
(నీ మంత్రంబె జపింతును) ల్లమున నే నీ పూజ గావింతు న
య్యా! (మా మేలొనగూర్చు దేవమణి వీవంచున్) కృపాంబోనిధీ!
 
(4 పాదములలో కుండలములలోగల పాదములు కంద పద్యమునకు సరిపోవును కదా). 

కంద గర్భిత సీసము:

కైలాసవాస! శంకర! బాల శశిధర!
    సురవినుత వరద సుజనపా(ల)
శూలాయుధా! మునిస్తుత శీల! దలతును
    త్రిపురహర! జితరతిపతి నిన్ (ను) 

సీసము 2 పాదాలలో కందపద్యమును వ్రాసేము కదా.  (ఆఖరి లఘువు తీసివేస్తే కందము అవుతోంది కదా).  ఇలాగ సీసపద్యములో 2 కందములు క్రిందన గీతలో 1 కందపద్యము మొత్తము 3 కందపద్యములను వ్రాయవచ్చును. 

కంద గర్భిత చంపకమాల/ఉత్పలమాలల గురించి ఇంతకు ముందే చెప్పుకొన్నాము.

మరికొన్ని విషయములను 5వ పాథములో చెప్పుకొనెదము.  స్వస్తి!
 
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి