20-1-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆయనకు నేవురైరి రామాయణమున”(లేదా...)“రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్”(భరతశర్మ గారి శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)
దశరథునికి మూవురు కళత్రములు కలుగ ,చక్కటి ప్రతిపాలనమును సలుపుటకయిపుత్రులు నలుగురును దన పుడమి కూడి “యాయనకు నేవురైరి రామాయణమున
తల్లి తొలిగురువు, గురువు దశరథుండు,మునివశిష్టుడు, గాధిజముని గురువులు కూడగా నగస్త్యుం డెంచ గురుపథమున నాయనకు నేవురైరి రామాయణమున
సీత సతిగను లక్ష్మణోపేతమగుచుభరత శత్రుఘ్నలన్ గూడి పరగుచుండి యాంజనేయుని బంటుగా నలరుకతననాయనకు నేవురైరి రామాయణమున!
తనయులు నలువురును గల దశరథునకు పిరిమి తోడ పెంచుకొనిన బిడ్డ యొకతి శాంతను గలిపి గణియింప సవము లుగనునాయనకు నేవురైరి రామాయణమున.కంగారేల వినంగ పంక్తిరథు సత్గాథన్ సుతుల్ నల్వురా సింగారమ్మది హెచ్చుగా గలుగు నా జిన్నారులే యుండగా సంగంబందున పుత్రికై నిలుచునా శాంతమ్మ లెక్కింపగా రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్.
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
రామ లక్ష్మణ సుగ్రీవ సామరస్యమమర సుగ్రీవ సచివులే తమను జేరవానరాగ్రగణ్యుల సంఖ్య వలనుమీఱనాయనకు నేవురైరి రామాయణమునశృంగారాకృతి కల్గియున్న విభుడౌ శ్రీరామ భద్రుండతోలాంగూలమ్ములఁ గల్గియున్న తతికిన్ రాజైన సుగ్రీవుడేసాంగత్యమ్మును గోరె వాని సచివుల్ సంగాతి బృందాన జేరంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్
తే॥ అన్న యాజ్ఞ ననిశమటు లమలు పరచుతమ్ములు విభీషణుఁడు సదా తత్పరుండునాంజనేయుఁడు రాముని యనుచరులననాయనకు నేవురైరి రామాయణమునశా॥ బంగారంబునుఁ బోలు తమ్ములనఁగన్ భావించఁగన్ మూవురేఅంగీకారము తోడ నెప్పుడును సాహాయమ్ముగా నిద్దరాసంగాతుల్ మరి రామచంద్రునకు విశ్వాసంబుఁ గాంచఁగ శ్రీరంగా యాయన కేవురైరి గదరా రామాయణంబందునన్(శ్రీరామునకు తమ్ములు ముగ్గురు ఆయన మాట జవదాటరు. హనుమ విభీషణుడు స్నేహితులు)సంగాతి స్నేహితుడు
సమస్య : ఆయనకు నేవురైరి రామాయణమునతే. పాదసేవచే సౌమిత్రి పవనసుతుడు,అర్కి స్నేహమున, జటాయువసువులనిడి,పాదుకలుమోసి భరతుండు, పరమ భృత్యులాయనకు నేవురైరి రామాయణమునభావం : శ్రీరామచంద్రుని పాదసేవ చేస్తూ లక్ష్మణుడు, హనుమంతుడు, స్నేహభావంతో సుగ్రీవుడు, రాముని కోసం ప్రాణాలర్పించి జటాయువు, మరియు ఆయన పాదుకలను శిరసున ధరించి భరతుడు రామాయణంలో ఆ స్వామికి ఐదుగురు గొప్ప సేవకులుగా ప్రసిద్ధి చెందారు.
దండకారణ్య మందుఁ గదన మొనర్ప ముని వరేణ్యల రక్షింప నినకులుండు మించి యొకపరి యెదిరించు మేటి యసురు లాయనకు నేవు రైరి రామాయణమున ఆయన కని యంటివి యెవ్వ రా నర వరుఁ డేవు రంటివి గద వార లెవ్వ రయ్య యెట్లు విశదమౌ నయ్య నీ విట్లనంగనాయనకు నేవు రైరి రామాయణమున కంగా రేలయ చెప్పెదన్ నిలుమ నిక్కం బే విధంబయ్యెనో యంగీకారముతో నజాత్మజుఁడు పూజార్హుండు శాంతాఖ్యఁ బ్రీతిం గాంతా మణిఁ గూఁతుఁ గాఁ గొనిన రీతిన్ బిడ్డ లింపారఁగా రంగా యాయన కేవు రైరి గదరా రామాయణం బందునన్
ఎంత యో చించి నాగాని సుంత యైన తెలియ ద య్యెను పూరణ సలుపు కొఱకు నాయన కు నేవురైరి రామాయణము న ననుట వై చిత్రి గా దోచె వినుట kaina
తేటగీతితల్లి, పినతల్లులిద్దరు దాశరథికిసీతకు జనని, గురుపత్ని చెల్లుదురనఁగనఁగ మాతృసమానులుగఁ దగు వారలాయనకు నేవురైరి రామాయణమునశార్దూలవిక్రీడితముసింగారించెడు తల్లియున్ సమముగన్ సేవించు పిన్నమ్మలున్బంగారమ్మగు విద్యనేర్పు గురుపత్న్యాదుల్ సతీ మాత లీభంగిన్ రామునకొప్పగన్ జననులై !వర్తింపగన్ శాస్త్రసారంగా యాయన కేవురైరి గదరా! రామాయణం బందునన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.భరత,లక్ష్మణ,శత్రుఘ్ను లరయ తమ్ములుగను,జానకి తనకు సతిగను నిలువభక్తితో చేరిన హనుమ బంటు కతననాయనకు నేవురైరి రామాయణమున.
దశరథునికి మూవురు కళత్రములు కలుగ ,
రిప్లయితొలగించండిచక్కటి ప్రతిపాలనమును సలుపుటకయి
పుత్రులు నలుగురును దన పుడమి కూడి
“యాయనకు నేవురైరి రామాయణమున
తల్లి తొలిగురువు, గురువు దశరథుండు,
రిప్లయితొలగించండిమునివశిష్టుడు, గాధిజముని గురువులు
కూడగా నగస్త్యుం డెంచ గురుపథమున
నాయనకు నేవురైరి రామాయణమున
సీత సతిగను లక్ష్మణోపేతమగుచు
రిప్లయితొలగించండిభరత శత్రుఘ్నలన్ గూడి పరగుచుండి
యాంజనేయుని బంటుగా నలరుకతన
నాయనకు నేవురైరి రామాయణమున!
రిప్లయితొలగించండితనయులు నలువురును గల దశరథునకు
పిరిమి తోడ పెంచుకొనిన బిడ్డ యొకతి
శాంతను గలిపి గణియింప సవము లుగను
నాయనకు నేవురైరి రామాయణమున.
కంగారేల వినంగ పంక్తిరథు సత్గాథన్ సుతుల్ నల్వురా
సింగారమ్మది హెచ్చుగా గలుగు నా జిన్నారులే యుండగా
సంగంబందున పుత్రికై నిలుచునా శాంతమ్మ లెక్కింపగా
రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్.
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామ లక్ష్మణ సుగ్రీవ సామరస్య
రిప్లయితొలగించండిమమర సుగ్రీవ సచివులే తమను జేర
వానరాగ్రగణ్యుల సంఖ్య వలనుమీఱ
నాయనకు నేవురైరి రామాయణమున
శృంగారాకృతి కల్గియున్న విభుడౌ శ్రీరామ భద్రుండతో
లాంగూలమ్ములఁ గల్గియున్న తతికిన్ రాజైన సుగ్రీవుడే
సాంగత్యమ్మును గోరె వాని సచివుల్ సంగాతి బృందాన జే
రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్
తే॥ అన్న యాజ్ఞ ననిశమటు లమలు పరచు
రిప్లయితొలగించండితమ్ములు విభీషణుఁడు సదా తత్పరుండు
నాంజనేయుఁడు రాముని యనుచరులన
నాయనకు నేవురైరి రామాయణమున
శా॥ బంగారంబునుఁ బోలు తమ్ములనఁగన్ భావించఁగన్ మూవురే
అంగీకారము తోడ నెప్పుడును సాహాయమ్ముగా నిద్దరా
సంగాతుల్ మరి రామచంద్రునకు విశ్వాసంబుఁ గాంచఁగ శ్రీ
రంగా యాయన కేవురైరి గదరా రామాయణంబందునన్
(శ్రీరామునకు తమ్ములు ముగ్గురు ఆయన మాట జవదాటరు. హనుమ విభీషణుడు స్నేహితులు)
సంగాతి స్నేహితుడు
సమస్య : ఆయనకు నేవురైరి రామాయణమున
రిప్లయితొలగించండితే. పాదసేవచే సౌమిత్రి పవనసుతుడు,
అర్కి స్నేహమున, జటాయువసువులనిడి,
పాదుకలుమోసి భరతుండు, పరమ భృత్యు
లాయనకు నేవురైరి రామాయణమున
భావం : శ్రీరామచంద్రుని పాదసేవ చేస్తూ లక్ష్మణుడు, హనుమంతుడు, స్నేహభావంతో సుగ్రీవుడు, రాముని కోసం ప్రాణాలర్పించి జటాయువు, మరియు ఆయన పాదుకలను శిరసున ధరించి భరతుడు రామాయణంలో ఆ స్వామికి ఐదుగురు గొప్ప సేవకులుగా ప్రసిద్ధి చెందారు.
దండకారణ్య మందుఁ గదన మొనర్ప
రిప్లయితొలగించండిముని వరేణ్యల రక్షింప నినకులుండు
మించి యొకపరి యెదిరించు మేటి యసురు
లాయనకు నేవు రైరి రామాయణమున
ఆయన కని యంటివి యెవ్వ రా నర వరుఁ
డేవు రంటివి గద వార లెవ్వ రయ్య
యెట్లు విశదమౌ నయ్య నీ విట్లనంగ
నాయనకు నేవు రైరి రామాయణమున
కంగా రేలయ చెప్పెదన్ నిలుమ నిక్కం బే విధంబయ్యెనో
యంగీకారముతో నజాత్మజుఁడు పూజార్హుండు శాంతాఖ్యఁ బ్రీ
తిం గాంతా మణిఁ గూఁతుఁ గాఁ గొనిన రీతిన్ బిడ్డ లింపారఁగా
రంగా యాయన కేవు రైరి గదరా రామాయణం బందునన్
ఎంత యో చించి నాగాని సుంత యైన
రిప్లయితొలగించండితెలియ ద య్యెను పూరణ సలుపు కొఱకు
నాయన కు నేవురైరి రామాయణము న
ననుట వై చిత్రి గా దోచె వినుట kaina
తేటగీతి
రిప్లయితొలగించండితల్లి, పినతల్లులిద్దరు దాశరథికి
సీతకు జనని, గురుపత్ని చెల్లుదురనఁ
గనఁగ మాతృసమానులుగఁ దగు వార
లాయనకు నేవురైరి రామాయణమున
శార్దూలవిక్రీడితము
సింగారించెడు తల్లియున్ సమముగన్ సేవించు పిన్నమ్మలున్
బంగారమ్మగు విద్యనేర్పు గురుపత్న్యాదుల్ సతీ మాత లీ
భంగిన్ రామునకొప్పగన్ జననులై !వర్తింపగన్ శాస్త్రసా
రంగా యాయన కేవురైరి గదరా! రామాయణం బందునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భరత,లక్ష్మణ,శత్రుఘ్ను లరయ తమ్ము
లుగను,జానకి తనకు సతిగను నిలువ
భక్తితో చేరిన హనుమ బంటు కతన
నాయనకు నేవురైరి రామాయణమున.