రచన - పోచిరాజు సుబ్బారావు
భారతీయుల నోముల పంటగాను
వచ్చె రెండువేల్ పదునేడు వత్సరమ్మె
యాయురారోగ్యసంపద లన్ని యిచ్చి
కాచు గావుత మనలను గరుణతోడ
పాడిపంటల వృధ్ధియె బహుళమగుచు
కూడుగుడ్డల కెప్పుడు కొదవలేక
యైకమత్యము దోడన నహరహమ్ము
పంచుకొందురు సంతోషపరిమళమును
తెలివితేటలయందున దెలివిమీరి
యేది మంచిది చెడ్డది యేది భువిని
దాన నెరుగుచు బ్రతియొక్క మానవుండు
మసలుచుండును నిరతము మాన్యుడగుచు
వత్సరమంతయు నరయగ
మత్సరములు వీడి జనులు మమతలతోడన్
నుత్సుకతలు గనబరచుచు
నుత్సవములు జేసికొందు రోపినగొలదిన్
అంతర్జాలము నేర్చిరి
వింతగ నీతరమునాటి పిల్లలు మిగులన్
పంతుళ్ళు వారు మనకిక
సంతసమున వారియొద్ద చట్టులు మనమే
సామరస్యము గలుగుచు సకలజనులు
వారు వారల వృత్తులు భవ్యముగను
జేయుచుందురు విడువక న్యాయ మెపుడు
సాలు మహిమయే యిట్లుండు సాంతముగను.