15, ఫిబ్రవరి 2026, ఆదివారం

దత్తపది - 213

16-2-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
"మామిడి - నారింజ - జామ - నేరేడు"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మృత్యువని కుజన్ దలఁచుమా మిడిసిపడక
    భవుని వింటి నారింజవమె విసరె నన
    రామమూర్తిని రాజా! మఱచితివేమొ!
    కుజన గణమునేరే డుండుకుండు నిజము

    రిప్లయితొలగించండి
  2. *(విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా)*

    పంత మేలనో నారిం జవమున రాము
    జేర్చు మగ్రజా మగువ యా సీత శుక్కు
    హితము కాదందునే రేడు విటుల సేయ
    మృత్యు హేతువగును సుమా మిడిసి పడకు.

    రిప్లయితొలగించండి
  3. ఒంట రియయి యుండగ "జామ" నొడిసిపట్టె
    నని దెలియగ "నే,రేడు" ని యణచనెంచి
    కడలి దాటి యా"నారిం,జ"క్కగ కయిగొన
    మేలుగ దెలిపెద విను"మా! మిడి" సిపడుచు

    రిప్లయితొలగించండి