మేడ - మిద్దె - గుడిసె - ఇల్లు చం:ఇది విను పాండుపుత్రచయ మేడ వసించిన స్వాస్థ్య ,సస్య సం పద లట నుండి, ధర్మ మట బాగుగ దా విలసిల్లు వారికై వెదుకగ మార్గ మిద్దె యిక వేగుల బంపుడు శాంతి నిచ్చు నా పదముల జూడ నేగుడి!సెబాసులు మీరలె పల్కకుందురే! (పాండవులు ఎక్కడున్నారో కనుగొనాలని సుయోధనుడు ఆలోచిస్తుంటే భీష్ముడు "వాళ్లు ఏ రాజ్యం లో ఉంటే ఆ రాజ్యం శాంతి సంపదల తో ఉంటుంది.అది తెలుసుకుంటే మీరే సెబాస్ అంటారు" అని చెప్పాడు.)
11 కామెంట్లు:
కందం
బలమేడ దాగె నర్జున?
వెలయించిన జ్ఞానమిద్దె? విలువిడి రణమున్
దొలగెడుఁ గుడి సెల్లదెపుడుఁ
దెలిసియు కంపిల్లు దేల ధీరుడవైనన్?
ధర్మమేడకుబోయెనోగదద్రౌపదీసతియేడ్వగా
కర్మమిద్దెగకాంచరాజుకుకాటికేగుటకయ్యెనే
మర్మమాగుడి, సెప్పనేర్తును మాధవుండెగచూడగా
అర్మిలిన్ ప్రణమిల్లువారల యానమెప్పుడు వర్ధిలున్
*(భీముని సలహా పాటించిన పిదప ద్రౌపతి కీచకుల సంభాషణ)*
ఇల్లుటాలువు కావైతి వీవు నన్ను
జేర రమ్మిద్దెస కనుచు కోర కీచ
కుండు,మనమేడ నుడవక కుదురుగ గల
నృత్య శాలకేగుడి సెజ్జ నేర్పరిచితి.
*(వస్త్సాపహరణానంతరం ఆగ్రహంతో భీముడు)*
పౌరుషమ్మేడ దాగెనొ పాండవులకు
గొప్పగా మనమిద్దెల కుడువనేమి
యిల్లుటాలుకీవిధమున నెగ్గుసలుప
దొమ్మి నన్ గుడిసెదరిక దుర్మతుండ్డు.
తే||గీ||
బేలు జూదమందొక "యిల్లు" వెనుక బడగ
నోట "మే డ" గ్గర పడెనని దన యుగరమున
"మిద్దె"నుండి రతనమును మెఱుకి యొసగె
ధర్మరాజు సం"గుడి సె"స ధర్మమనుచు
మోహన మురళీ రవ[మేడ]! మోదమలర
తన్మయత్వము చేకూర్చు తరుణ[మిద్దె]!
సు[గుడి సె]లవడుగనిదాన సుందరాంగ!
[ఇల్లు]డుగు మెడిదము విననేల కృష్ణ!
ఈ + లుడుగు = ఇల్లుడుగు
లుడుగు = ఎద్దు మెడనుకట్టు గంట.
దుర్యోధనాదులతో శ్రీకృష్ణుడు:
న్యాయమేడ గలదు నయవంచనము దప్ప
బుద్ధిహీనుల గుణ మిద్దె కాదె!
యాగుడి సెలవింక యాలమందు గలుతు
మిదె పితామహ బ్రణమిల్లుచుంటి
కురు క్షేత్ర సంగ్రామం లో ---
న్యాయమే డ స్సిన విరోధి వేయ దమకు
తెలుపు మి ద్దె టులొనరించ వల సె మీకు?
కొంచ మాగుడి సెల రే గి వంచన ము గ
వేడె దో యిల్లు పట్టియు వీరు డొకడు
మే మేడ భీష్ముఁ డెక్కడ
మే మిద్దెస మార్కొనంగ మే లగు నేమో
వే మగుడి సెలఁగ మేలా
యే మెయి నని నతిశయిల్లు నింపుగ జయమే
మేడ - మిద్దె - గుడిసె - ఇల్లు
చం:ఇది విను పాండుపుత్రచయ మేడ వసించిన స్వాస్థ్య ,సస్య సం
పద లట నుండి, ధర్మ మట బాగుగ దా విలసిల్లు వారికై
వెదుకగ మార్గ మిద్దె యిక వేగుల బంపుడు శాంతి నిచ్చు నా
పదముల జూడ నేగుడి!సెబాసులు మీరలె పల్కకుందురే!
(పాండవులు ఎక్కడున్నారో కనుగొనాలని సుయోధనుడు ఆలోచిస్తుంటే భీష్ముడు "వాళ్లు ఏ రాజ్యం లో ఉంటే ఆ రాజ్యం శాంతి సంపదల తో ఉంటుంది.అది తెలుసుకుంటే మీరే సెబాస్ అంటారు" అని చెప్పాడు.)
కామెంట్ను పోస్ట్ చేయండి