10, ఆగస్టు 2016, బుధవారం

సమస్య - 2111 (రాముఁడు ధర్మమున్ జెఱచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్"
ఈ సమస్యను పంపిన కె. ఈశ్వరప్ప గారికి ధన్యవాదాలు.
లేదా...
"రాముఁడు ధర్మమును జెఱచె రాజులు మెచ్చన్"

83 కామెంట్‌లు:

  1. భామను తాను చేకొనెడి పట్టున నాతి చరామి యంచు తాన్
    హోమము సాక్షిగా పలికి యొంటరిగా విడనాడి పంపడే
    నీమమె రాజధర్మమవనీపతికిన్ కద! బాహ్య దృష్టికిన్
    రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదం చివర తాన్ అని కాక తా అని ఉండాలండీ.రెండవపాదం చివర పంపుచో అని ఉండాలి. ఒంటరిగా అన్నది అంతసంతృప్తికరం కాదు కాని యతిమైత్రిస్థానంలో పడింది మరి. విరామచిహ్నాల అవసరం సంప్రదాయకవిత్వంలో లేదు. పూరణబాగుంది.

      తొలగించండి
  2. ఏమని జెప్పుదు వింతను
    కాముని వశమైన పడతి గరితను దెచ్చెన్
    నీమము దప్పని ప్రభువనె ?
    రాముడు ధర్మమును జెఱచె రాజులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరిగారూ, 'కాముని వశమైన పడతి' అని అంటే దురర్థం వస్తుందండి. 'కామవశుండగుచు చెలగి కాంతను దెచ్చెన్' అందామా? మూదవపాదం 'నీమము దప్పని ప్రభువే' అని ఉంటే మీ‌భావం మరింత సరిగా ఉంటుందా? మరి సమస్యాపాదానికి అన్వయం ఏదీ‌ కనిపించటం‌ లేదండీ. మీ‌ఉద్దేశం అంత స్పష్టం‌ కావటం‌ లేదు.

      తొలగించండి
  3. కామితమున్న చాలదునకారముఋత్వముసంధి మైత్రిని న్
    సేమము సేయకుండనతి శీఘ్రపు బూరణజేయబోవుచు
    న్నీమ ముదప్పితిన్.బరచె.యే .జెరచెన్నయె నెట్లు దైవమా.
    రాముడు ధర్మమున్.జెరచె.రాజులు యోగులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణగారూ, మీ‌ ప్రయత్నం బాగుంది. కాని నేను సరిగా పట్టుకోలేక పోతున్నానా అనిపిస్తోంది. మొదటి సంగతి విరామచిహ్నాలు వద్దు. వాటిని పద్యంలో భాగంగా ఎప్పుడూ చూడకూడదు - నన్నడిగితే వాడకూడదు. పరచె అన్నదే చెరచెన్ అయె అంటారా అదెట్లూ? బ అన్నది చ కాలేదు కదా. ఒకవేళ మీరు సమస్యాపాదంలో పరచె అని చదివి ఆనందంగా పూరించబోయి చెరచె అని ఉందేమి దేవుడా అనుకున్నానని అంటున్నారా? మంచి ఊహ. కాని ఇంకా సరిగా అన్వయం కావటం‌ లేదు నాకు.

      తొలగించండి
  4. క్షామము గోరిరొనరులిటు
    రామాయణ కావ్యమునుపరాకున జెప్పన్
    సామముగ భరతు జంపియు
    రాముడుధర్మమును జెరచె రాజులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగుంది. క్షామము గోరిన భంగిని అంటే మొదటిపాదంగా ఎలా ఉంటుందంటారు?

      తొలగించండి
  5. కోమలి సీతనే వలచి కోరుచు ప్రీతిగ పెండ్లి యాడినన్
    నీమము దప్పియాతడిటు నేకత మందున వీడెనెందుకో
    కాముడు రావణుండు తనుగారడి జేయుట కేమిహేతువో
    రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏకత మందున బదులు ఏకత ముండగ అంటే సబబు. 'రావణుండు తను గారడి' బదులు 'రావణుం డటుల' అనటం సబబు. కాని సమస్యకు పరిష్కారం కనబడదండీ ఇందులో.

      తొలగించండి
  6. క్షేమము గోరి రాజ్యమున కేవల మొక్కని మాటకోసమై
    భూమితనూజ నాత్మసతి బోవిడిచెం గద కాననంబులం
    దేమి విచిత్రమో! యతివ నివ్విధి రోయుట నెంచి చూడగా
    రాముడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపగన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యధార బాగుంది. పూరణం‌ బాగుంది
      పద్య‌ం‌ బాగుంది కాని పాత్రౌచితి దెబ్బతింది. మున్నొకసారి చెప్పినట్లు పౌరాణిక చారిత్రకాది పాత్రలపరంగా కవిత్వం చెప్పేటప్పుడు ఆయా పాత్రల స్వభావాన్ని మార్చివేయకూడదు. మీరు కావాలని అలా కావ్యనిర్మాణం చేయదలచుకుంటే అది వేరే విషయం - వివాదాస్పదం.

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  8. భామా , సీత మగడెవడు ?
    ఆమాతను చెరగొనంగ అసురుడు జెరచె
    న్నేమది ? విభీషణు శరణు ?
    రాముడు, ధర్మమును జెఱచె, రాజులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారయుక్తపూరణాయత్నం బాగుంది. ప్ర.విభీషణు శరణు? జ. రాజులు మెచ్చన్ అన్నది అస్పష్టంగా ఉన్నది. అందుచేత ప్రశ్నను తానెటు లేలెన్? అనో మరొకవిధంగానో మార్చవలసి ఉంటుం దనుకుంటాను.

      అసురుడు అని విసంధిగా వ్రాసారు. అలా వ్రాయటం పద్యకవితాసంప్రదాయం కాదు. చెఱగొనంగ నసురుడు చెరచెన్ అనే ఉండాలి. జెరచె అని చ ను జ వలె మార్చటానికి అసురుడు ద్రుతం కాదుగా. చెఱగొనంగన్ అన్న ద్రుతం గమనించాలి.

      తొలగించండి
  9. శ్రీగురుభ్యోనమః

    కామము హెచ్చి రావణుడు కాంచుచు జానకి కిట్లు పల్కె నో
    భామిని వానరోత్తముడు వాలిని జంపెను చెట్టుచాటునన్
    కోమలివైన నీకు పలు క్షోభలు కానల గల్గజేసె నా
    రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రిగారూ, పద్యధార బాగుంది. కాని సమస్యను సరిగా పరిశీలించండి. రాముఁడు ధర్మమున్ జెఱచె అని రావణుడి ఆక్షేపణను బాగా చెప్పారు. కాని పాదద్వితీయార్థంగా ఉన్న రాజులు యోగులు సంతసింపఁగన్ అన్నదానికి సమర్థన రావటం లేదు కదా అలాగైతే.

      తొలగించండి
  10. ఏమంటిరిమీరిప్పుడు
    రాముడుధర్మమునుజెరచెరాజులుమెచ్చన్
    రాముడుధర్మపునిరతుడు
    రామునినేనిందజేయరమ్యంబగునా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపం అజ్ఞాత గారు కంగారు పడ్డారు. సమస్యలు ఆలాగే ఉంటాయండీ. సుబ్బారావు గారూ, ధర్మపునిరతుడు అన్నది వింతగా ఉంది. రాముడు ధర్మనిరతుడా రామునే అని అన్నప్పుడు మూడవపాదం బాగా తెగుతుంది. రామునినే అన్నది తప్పండీ. రామునే అనే అవుతుంది అందుచేత చివరి పాదం 'రాముని నిందించు టెట్లు రమ్యం‌బగునో' అని మారుద్దాం. పనిలో పనిగా పెద్దరామారావుగారి ధోరణిలో ఏమంటిరి యేమంటిరి అనేస్తే ఎత్తుగడలో ఒక అందం.

      అదలా ఉంచి పద్యం రెండు భాగాలైపోయింది గమనించారా? సమస్య ఒక statement అనగా ఒక ఉటంకింపు. ఏమన్నారు ..... .... అనా ?‌ అని కదా చెప్పవలసింది? కొస తప్పిపోయి వెలితివచ్చింది. ఇల్లాంటివి గమనించాలి. అందుకే అన్వయం కూడా కొంత కృతకంగా వస్తున్నది.

      తొలగించండి
  11. నీమము దప్పక సతతము
    రాము డధర్మమును జెఱచె రాజులు మెచ్చ
    న్నేమందుఁడొ కొమ్మిడగన్
    రాముడు ధర్మమును జెఱచె రాజులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది భేషుగ్గా ఉంది. చివరి పాదం సమస్యాపాదంగా అవసరం రాలేదిక్కడ. అందుచేత మరింత సరిగా ఉండాలంటే రాముడు ధర్మమును జెఱచెరా యని వచ్చెన్ అని చెప్పండి.

      తొలగించండి
    2. శ్యామలీయం గారికి ధన్యవాదములు.అలా చివరి పాదం వ్రాస్తే. పూరణలో సమస్యాపాదం కనిపించని లోపమును ఎలా సర్ది చెప్పుకోగలను, వివరించ ప్రార్థన.

      తొలగించండి
    3. పూరణలో రెండవపాదం సమస్యాపాదమే కదా. ఐతే మీ‌పద్యం మూడుపాదాల్లో పూర్తయింది. కొంచెం సాగదీసి నాలుగు పాదాలు చేయటమే. సమస్యాపాదాన్ని మరొకసారి చివరన చేర్చటం సరికాదు.

      తొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కాముకు డౌచు , కుక్కుటముగా " కొకొరో "

    ............ యని మోసగి౦చె నౌ

    రా ! మునివర్యు గౌతము | నహల్యను

    ................ కూడి , సురే౦ద్రు డైన సు

    త్రాముడు ధర్మమున్ జెరచె | రాజులు

    .............. యోగులు స౦తసి౦పగా :--

    నా మఘవు౦డు శాప హతు డాయె

    ............... సహస్ర నేత్రు డై ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణావిధానం బాగుంది. రాముణ్ణి సుత్రాముణ్ణి చేస్తే అంతా సులువైపోయింది మీకు. బ్రహ్మాండం. సుత్రాముడు, మఘవుడు, సహస్రనేత్రుడు అని ఇంద్రుణ్ణి మూడు పేర్లతో సంబోధించారు కూడాను.

      తొలగించండి
  13. రాముడుధర్మమున్ జెరచెరాజులుయోగులుసంతసింపగన్
    వారెవయిట్లుగాబలుక బాగుగనుండెనె?యిస్ధలంబునన్
    రాముడుధర్మపాలకుడురామునినిట్లుగధర్మహీనుగన్
    దాముదలంచగాసబబె?తార్కికలోకముసంతసించునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపాదములోప్రాససవరణ
      గోముగనిట్లుగాబలుకగౌరవమాయెనె?

      తొలగించండి
    2. గోముగ నివ్విధింబలుకకూడదు మాన్యులు సత్యవంతులై....అనునది బాగున్నదేమో పరిశీలించండి, మిత్రులు సుబ్బారావు గారు.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. సమస్యాపాదాన్ని అలాగే విడిగా ఉంచి చెప్పటం బాగోలేదు. ఎందుకంటే అక్కడ వాక్యం పూర్తిచేసి మళ్ళా మరొకటి ఎత్తుకుంటున్నారు. యిస్ధలంబునన్ అన్నపదం పొరపాటు. త్రికసంధి ఊష్మరేఫేతరమైన అసంయుక్త హల్లు పరమైనప్పుడే కాని జరగదు. ఈ‌ స్ధలంబునన్ అనే ఉంచాలి. రామునినిట్లుగ బదులు రాముని యిట్లుగ అనే ఉండాలి యడాగమమే వస్తుంది లేదా రామునిట్లుగ అని వస్తుంది (అది మనకి పనికిరాదు).
      ప్రాసభంగం గమనించి మీరు చేసిన సవరణతో యతిమైత్రిభంగం. గో-గౌ అని మైత్రి కుదరదు కద.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    * గురువర్యులకు హృదయాభిన౦దనలు *

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. గోముగ కౌశికాధ్వర మకుంఠిత దీక్ష వహించి కాచె భూ
      భామఁ దరింప బుట్టె నిల భార్గవ కార్ముక జేతయున్ మహా
      భీమ మయోనిజం దనుప వీర్యమునన్ మిధిలాపురమ్మునన్
      రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్
      [ధర్మము= విల్లు]


      ప్రేమ మయుడు కాపాడును
      రాముఁడు ధర్మమును, జెఱచె, రాజులు మెచ్చన్,
      బీమ నిశాచర కోటిని
      వేమరు కానల మునులను వేధింపంగన్

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారు,
      మీరు వృత్తములో సమస్యను సమర్థవంతముగా పూరించారు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. ధర్మాన్ని వింటిని చేసిన పూరణ బాగున్నది. కందంలో కాపాడును అనా కాపాడెను అనా మీ ఉద్దేశం ఈ‌ పూరణలో? మొదటిది మరింత యుక్తం అనుకుంటాను. కందం చివరిపాదం మార్చండి ముగింపు ధారను దెబ్బతీసినట్లుంది.

      తొలగించండి
    4. శ్యామలీయంగారు ధన్యవాదములు. కాపాడును అనియే నాభావము. మీరన్నట్లు ధారాభంగ మయినది.సవరణను తిలకించగోర్తాను.

      ప్రేమ మయుడు కాపాడును
      రాముఁడు ధర్మమును, జెఱచె, రాజులు మెచ్చన్,
      బీమ నిశాచర కోట్యు
      ద్దామాహవ దుర్జయ బల దర్పోద్ధతమున్

      తొలగించండి
  16. కామము పెచ్చరిల్ల తన కన్నుల, కూడి యహల్యతోడ సు
    త్రాముడు ధర్మమున్ జెఱచె, రాజులు యోగులు సంతసించగన్
    రాముడు రావణున్ దునిమి రక్షకుడయ్యెమనుష్యజాతికిన్
    క్షామము లంతరించి ప్రజ సంతస మొందిరి రామరాజ్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. పూరణ బాగుంది. కాని చివరన రామరాజ్యమున్ అంటే అన్వయం కాదు. రామపాలనన్ అని సాధించండి. సుత్రాముడితో గురుమూరిగారు కూడా ఉదయమే ఫుట్‌బాల్ ఆడేసారు.

      తొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ప్రేరణ గూర్చగా గురువు వేదికజేరి |స్వయంవరమ్మునన్
    ప్రేమగ సీత చూపులకు పెద్దల దీవెనలంది మెప్పుగా
    రామపరాక్ర మంబట పరాజిత రాజుల గుండె మండ?శ్రీ
    రాముడు ధర్మమున్ జెఱిపె|రాజులు యోగులు సంతసింపగన్. {ధర్మం=విల్లు}సీత స్వయం వారానవిల్లువిరచిరామునిపెళ్లి రాజులుయోగులు ఆనందించుట.}
    2.కామితసిద్దిగ దశరథ
    రాముడు ధర్మమును జెఱచె రాజులు మెచ్చన్
    కోమలి సీతా వరముగ
    పామరులకు రక్షగూర్చ భగవంతుడిగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు నమస్సులు. మీరు విల్లను అర్థములో ధర్మము పదము ప్రయోగించి సమస్య నిచ్చారని యూహించితిని. మంచి సమస్య నిచ్చారు. ధన్యవాదములు.
      మీపూరణ బాగుంది. మొదటి పాదములో ప్రాస ను మర్చిపోయారు.
      “వేమరు తెల్పగా” అనిన ప్రాస దోషముండదు.
      “పరాజిత రాజుల గుండె మండ” రాజులు బహువచనము, గుండె యేకవచనము. “రాజుల గుండె లెండ” అనిన సరిపోవు ననుకుంటాను. “?” బదులు “!” యుక్తము.
      మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈశ్వరప్పగారు. మీరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అది స్వయంవరమూ‌ కాదు అక్కడ సీతా లేదు వాల్మీకం ప్రకారం. అదటుంచుదాం.
      పరాజితరాజులు తప్పు. సంస్కృతపదం పైన తెలుగుపదం సమసించదు. (గర్భగుడి లాంటివి తప్పేను)
      కందంలో‌ ప్రథమార్థం బాగుంది. రెండవసగం కుదరలేదు. సీతావరముగ బదులు సీతను చేగొనె అనీ, రక్షగూర్చె అనీ‌ మార్చితే నయంగా ఉంటుంది.

      తొలగించండి
    3. శ్యామలరావు గారు సమాసాంతపదము సంస్కృతసమ పదమును వాడవచ్చనుకుంటాను. తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు ల వలె. రాజు తత్సమము కదా. పరిశీలించండి.

      తొలగించండి
  19. భీమముతోడ జంపియును వేమరు రాజుల బర్శపాణియౌ
    రాముడు ధర్మమున్ జెరచె, రాజులు యేగులు సంతసించగన్
    రాముడు రావణాద్యసుర రాక్షసులవ్ తెగటార్చి ధర్మమున్
    ఈ మహి నిల్పినాడమలు డీ పురుషోత్తము డాత్మసాక్షిగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ బాగుంది. అభినందనలు.
      పర్శువు ను పర్శ యన్న సాధువు కాదు. "బర్శపాణియౌ" కు బదులు "గండ్రగొడ్డలిన్" అన్న సరిపోవును. గండ్రగొడ్డలి యాయుధముగా కలవాడు రాముడంటే భార్గవరాముడే.
      "రావణాద్యసుర రాక్షసులన్" అసురుడు, రాక్షసుడు ఏకార్థములే. "రావణాదిఘనరాక్షసులన్" అన్న సరిపోవును.
      "ధర్మము / న్నీమహి" అనండి. యోగులు కు "యే"గులని పడింది.

      తొలగించండి
    2. కాలేశ్వర రావు గారు నామస్కారములు
      సందేహ నివృత్తి గురించి▪▪▪
      గండ్రగడ్డలిన్ రాముడు అంటె సమన్వయం కుదురుతుందా
      అసురులు. రాక్షసులు వేరువేరని చదివినాను•••
      పర్శుపాణియై (యౌ)రాముడు తప్పౌతుందా•••
      యే •••న్నీమహిమ సవరించాను
      విట్సాప్ చిన్నదై నందున
      అక్షరములు తప్పుచున్నవి



      తేలింది

      తొలగించండి
    3. లక్ష్మీనారాయణ గారు నమస్కారములు. "పరశువు" "ఉ"కారాంత పుంలింగ సంస్కృత పదము. "పరశుపాణియౌ(యై)", "పరశురాముడు" సాధుసమాసములు. పరశువు తత్సమము. పర్శువు దానికి రూపాంతర తెలుగుపదము. "పర్శ" యనిన నసాధువు. "పర్శు పాణి" అంటే పరశువు(గొడ్డలి) యొక్క పాణి యని అర్థము రావచ్చు.
      గండ్రగొడ్డలి తో జంపెనన్న యిక్కడ రాముడంటే పరశురామునికి వర్తిస్తుంది.పరశురాముడు కూడా రాముడే.
      అసురుడు సురుడు కాని వాడు. రావణాది యన్నారు. రావణుడు రాక్షసుడు కాబట్టి "రావణాద్యసురులు" లో అసురులంటే రాక్షసులని యర్థము వస్తుంది.
      ఇది నాకు తెలిసిన విషయము - కామేశ్వర రావు. ( "కాలేశ్వర" కాదు)

      తొలగించండి
    4. ధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారు

      తొలగించండి
    5. ధన్యవాదములు కామేశ్వర రావు గారు చక్కగా వివరించారు

      తొలగించండి
  20. కవిమిత్రులారా,
    నిన్నటి జ్వరం ఈరోజు తీవ్ర మయింది. కనీసం పూరణలను చదివే ఓపిక లేదు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేయవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. విశ్రాంతి తీసుకోండి.

      తొలగించండి
    2. మిత్రులు శంకరయ్యగారు,

      మీరు ఆరోగ్యపరీక్షలు క్షుణ్ణంగా చేయించుకున్నారా? అది ముఖ్యం. పిదప తరచూ జ్వరపడటానికి కల కారణం వైద్యులద్వారా తెలుసుకొని తగినమందులు వాడండి.

      ఈ రోజు రాత్రి పూరణలను శక్తిమేరకు పరిశీలించగలను. మీరు విశ్రాంతి తీసుకొనవలసిందిగా విజ్ఞప్తి.

      [ ఆదివారం నాటి సభకు అనివార్యకారణాలవలన రాలేకపోయాను. ]

      తొలగించండి
  21. ప్రేమను గరువే జేప్పగ
    భామను మనవాడదలచి పౌరుషమొప్పన్
    యేమని జెప్పుదు సభలో
    రాముడు ధర్మమునుజెఱచెరాజులుమెచ్చన్

    రిప్లయితొలగించండి
  22. జ్వరముతగ్గుటకొరకునైసామి!మీరు
    మంచిమందులువాడుడు,మరలమరల
    సుస్తిచేయకుండగజేయుసూదిమందు
    బెటనుసాలది పోగొట్టుచేటుమేను

    రిప్లయితొలగించండి
  23. నీమము దప్పక నడిపెను
    రాముడు ధర్మమును! జెఱచె రాజులు మెచ్చన్
    సామాన్యుని మాట నెపుడు
    భూమీశులు లక్ష్య బెట్ట బోరను నిందన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి పూరణ. అభినందనలు. సమస్యాపాదానికి ఆపాదించిన విరుపూ, చెఱచె ..నిందన్ అన్న అన్వయమూ ఒప్పుగా ఉన్నాయి.

      తొలగించండి
  24. కాముని ప్రాభవమ్మునను గౌతమ పత్నిని కోరెనింద్రుడే
    ఆ ముని వేషధారిగ నహల్యను వంచన జేసెనట్లు సు
    త్రాముఁడు ధర్మమున్ జెఱచె, రాజులు యోగులు సంతసింపఁగన్
    రాముని పాదధూళి పడి రాయియె నాతిగ మారెనక్కటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ రాజులు యోగులు సంతసింపగన్ అన్నదానికి అన్వయం సాధించబడింది సరిగా. బాగుంది. కోరెనింద్రుడే అనటం బదులు కోరి యింద్రుడే అంటే సరిగా ఉంటుంది.చివర్న అక్కటా ఏమిటీ‌ అన్యాయంగా! మీ కిష్టం‌ లేదా అహల్యాశాపమోక్షణం? మారె లెస్సగన్ అనండి మరింత లెస్సగా ఉంటుంది పద్యమూ.

      తొలగించండి
    2. శ్యామలీయంగారు, మీ సూచనలు తీసుకున్నాను. ధన్యాలు!

      తొలగించండి
  25. భామిని మైథిలీ!కనగ భండనభీముడు సద్గుణాంచిత
    స్తోముడు ధర్మపూర్ణ ఘన శూరుడు చాటుగ వాలిజంపెగా
    తా, మునివాటికన్నతివ తాటకజంపెను దుష్టశీలియై
    రాముడు ధర్మముంజెఱచె!రాజులు యోగులు సంతసింపగన్

    కామిని న‌హల్య గూడగ
    నా మునివరునింటకుక్కుటాకృతి దూరెన్
    కాముడుప్రేరేచగ-సు
    త్రాముడు ధర్మమునుజెఱచె రాజులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్తంలో చూదాం. సద్గుణాంచితుడు అనే సద్గుణాంచితస్తోముడు సరికాదు. కావలిస్తే సద్గుణస్తోమాంచితుడు అని అవుతుంది. ఇక్కడ (మరి కొందరి పద్యాల్లోనూ అనుకుంటాను) రాజులు యోగులు సంతసింపగన్ దగ్గరకు వచ్చేసరికి బలవదన్వయం ఐపోతోంది.
      కందంలో‌, రాజుల్ మెచ్చన్ అన్నదానికి అన్వయం లేదు చూడండి.

      తొలగించండి
  26. మాన్యులు శంకరయ్య గారికి.. ఆరోగ్యవిషయంలో మీరు అశ్రద్ధ చూపవద్దని మనసా కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  27. హేమపు సతి ప్రక్కనెవరు? --- రాముడు

    నీమంబును దప్పినపుడు యేమందుమిలన్ ---
    ధర్మమును జెఱచె

    రాముడు విల్లును విఱచెను --- రాజులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  28. హేమపు సతి ప్రక్కనెవరు? --- రాముడు

    నీమంబును దప్పినపుడు యేమందుమిలన్ ---
    ధర్మమును జెఱచె

    రాముడు విల్లును విఱచెను --- రాజులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు సార్లెందుకు వ్రాసారు?
      పద్యాన్ని పద్యరూపంలోనే వ్రాయండి దయచేసి.

      తొలగించండి
  29. రాముడుధర్మమున్ జెరచెరాజులుయోగులుసంతసింపగన్
    గోముగనిట్లుగాబలుకగూడునెమీకదియిస్ధలంబునన్
    రాముడుధర్మపాలకుడురామునినిట్లుగధర్మహీనుగన్
    దాముదలంచగాసబబె?తార్కికలోకముసంతసించునే!

    రిప్లయితొలగించండి

  30. సామముతో పాలించెను
    నామాయావియుసతినప హరణ మొనర్చన్
    భామ కొరకని విలువిరిచె
    రాముడు ,ధర్మమున్ చెఱచె, రాజులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారయత్నం‌ బాగుంది. ప్రశ్నలు ప్రశ్నారూపంలో రావలసి ఉన్నది. సవరించిన పద్యం చూడండి.
      సామముతో‌నెవడేలెను?
      ఆ మాయావియు సీత బట్టె నది యెట్టిదయా?
      యే మా విల్లెటు విరిగెను?
      రాముడు ,ధర్మమును చెఱచె, రాజులు మెచ్చన్.

      (విరామచిహ్నాలు కేవలం మీ సౌలభ్యం కోసం. నేనైతే వాడను. అవి అవసరం కాదు.)

      తొలగించండి

  31. కోమలి నా సహోదరికి కోసెను నాసికయున్ శ్రవస్సులన్
    నేమము దప్పి రక్కసి యనే మిషతో నబలన్ గణింపకే
    యేమది కండకావరము? హీనుని యంతము జూతు నిప్పుడే
    రాముడు ధర్మమున్ జెరచె రాజులు యోగులు సంతసింపగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనే అని అను అన్నదానికి ప్రతిగా ప్రయోగం‌కూడదు. గ్రామ్యత వలన. గణింపకే అని గణింపకన్ అన్నదానికి ప్రత్యామ్నాయం‌ చేయటమూ కుదరదు. రావణోవాచ అని చెప్పి ఇలాగనటం‌ బాగానే ఉంది.

      తొలగించండి
  32. ధామము నందు భార్యగను తార వసించగ మోహచిత్తుడై
    కామముతో సహోదరుని కాంతను బట్టిన వాని ద్రుంచగా
    నీమము దప్పి వాలి నవినీతిగ బాణము వేసి మాటుగా
    రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బొడ్డు శంకరయ్యగారు మళ్ళీ మొదటికి వచ్చారు వాలివధ అధర్మం అంటూ తమ పూరణతో. అంత ఉచితం‌ కాదు. ఈ‌లాగు చేయవద్దు. సరే. ధామము అని విశేషణపూర్వకంగా కాక వాడుక ఉన్నదా అని ఆలోచించాలి - నాకు తెలిసి లేదు. వేసి అన్నప్పుడు కంటే వేయ అని మార్చితే అన్వయం సరిగా వస్తుంది.

      తొలగించండి
    2. గురుతుల్యులు శ్యామలీయం గారికి నమస్సులు,
      వ్రాస్తున్నపుడే అంతగా రుచించలేదు పద్యం. వ్రాసాను కదా అని పోస్టు చేశాను.
      పద్యాన్ని మార్చుతాను. మీ అమూల్యమైన సూచనలకు కృతజ్ఞతలు. ఇలాంటి మీ సలహాలు మా వంటి వారికి చాల తోడ్పడతాయి. మీరు తప్పక సూచనలు ఇవ్వడం కొనసాగించాలని కోరుకుంటూ.
      మీ విధేయుడు.
      బొడ్డు శంకరయ్య

      తొలగించండి
  33. రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్
    రాముడు ధర్మమున్ నిలుప రాజసమున్ మరి సంతరింప గన్
    రాముని పాదమే తగల రాయి అహల్యగ మారగా ప్రజల్
    రాముని నామమే సకల రాజస లాలస భోగమే కదా

    రిప్లయితొలగించండి