8, జనవరి 2013, మంగళవారం

పద్య రచన - 215

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. పరమ భక్తియుతుల పరమార్థసాధన
    చలన చిత్రసీమ చక్కగాను
    చూపియించి తనదు శోభ పెంచుకొనగ
    తోడుపడిన వారు తొల్లి గలరు.

    రిప్లయితొలగించండి
  2. నాగయ్య నటించె బళా
    భాగవతోత్తమునిగ చాల పాత్రలలోనన్
    యోగివరేణ్యసముండని
    బాగుగ వినుతింతు వాని భవ్య చరిత్రన్

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 08, 2013 7:58:00 AM

    అయ్య వేమయ్య త్యాగరాజయ్య భక్త
    రామ దాసయ్య పోతయ్య రంగు హంగు
    చిత్ర రంగాన పాత్రలు చేసి చనిన
    కీర్తి శేష నాగయ్యకు కేలు మోడ్తు.

    రిప్లయితొలగించండి
  4. చిత్ర సీమ యందు చిత్తూరు నాగయ్య
    భక్త పోత నంచు ముక్తి నొంది
    భక్తి పాత్ర లందు బహు ప్రీతి పాత్రమై
    భక్త జనుల మదిని రక్తి నొందె

    రిప్లయితొలగించండి
  5. పాత్రమెరుగుచు నటియించు పాత్రధారి
    గానమందున పేరున్న గాత్రధారి
    భక్తి పాత్రల కతడేమొ బాగ పేరు
    అవును చిత్తూరు నాగయ్య యతని పేరు

    రిప్లయితొలగించండి
  6. చిత్తూరు వంశ మండన !
    సత్తా జూపించి తీవు సరసపు నటనన్
    చిత్రాల నటన తత్పర !
    బత్తిని నాగయ్య ! నీకు బ్రణతు లొనర్తున్

    రిప్లయితొలగించండి
  7. నాడు యశమునందె నాగయ్య నటుడిందు
    సర్వజగతిలోన సములికెందు
    కానరారు నిజము ఘనుడెన్నగా నందు
    జనుల కతని నటన కనులవిందు.

    రిప్లయితొలగించండి
  8. భాగవత కర్త పోతన్నె భక్త రామ
    దాసు, కీర్తనలను పాడి త్యాగ రాజు
    లవకుశులఁబెంచు వాల్మీకి రత్నమతడె
    నటుడు నాగయ్య కేచెల్లు పటిమ మెరయ

    రిప్లయితొలగించండి
  9. భాగవత కర్త పోతన్నె భక్త రామ
    దాసు, కీర్తనలను పాడి త్యాగ రాజు
    లవకుశులఁబెంచు వాల్మీకి రత్నమతడె
    నటుడు నాగయ్య కేచెల్లు పటిమ మెరయ

    రిప్లయితొలగించండి
  10. రంగస్థల సినీ నటుడు, గాయకుడు, సహృదయుడు, అన్నదాత అయిన చిత్తూరు నాగయ్య గారిని గురించి మంచి పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదములు...

    రిప్లయితొలగించండి






  11. భక్తి పాత్రల నద్భుత భంగి దాల్చు
    ఆంధ్ర ''పాల్ముని ''యనుచు బ్రఖ్యాతిగాంచె
    మధురగాయకుండును,సర్వమాన్య చరితు
    డతడె చిత్తూరునాగయ్య యనగ బరగు.

    రిప్లయితొలగించండి
  12. కమనీయం గారూ,
    నాగయ్య విశిష్టతను తెలుపుతున్న మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి