21, డిసెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 197

నేటినుండి మూడు రోజులు వరంగల్‌లో ‘కాకతీయ ఉత్సవాలు’
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. కాకలు దీరిన యోధులు
    కాకతి రాజుల బహుమతి కట్టడములివే
    లోకమున నిలిచి యుండెను
    శ్రీకరముగ నోరుగంట జేజేలనరే !

    రిప్లయితొలగించండి
  2. కాకతీయులు గట్టిన కట్టడములు
    చూడ ముచ్చట గొలుపును చూపరులకు
    వారు చెక్కిన శిల్పాల వాడి తనము ,

    నాటి వైభవ మంతయు నాట్య మాడు .

    రిప్లయితొలగించండి
  3. కాకతీయవంశ ఘనచరిత్రము విన్న
    వారలెల్ల గొప్పవనిత రుద్ర
    మాంబ గాథ తెలిసి యద్భుతమనుచును
    పొగడుచుంద్రు మిగుల ముచ్చటగను.

    రిప్లయితొలగించండి
  4. ఘన కీర్తిన్ బ్రకటించు దోరణము సాకల్యమ్ముగా సోదరా!
    కనువిందయ్యెడు కాకతీయ ప్రథిత క్ష్మాపాల వైశిష్ట్యమున్
    దనరం జేయుచు నెల్ల కాలములలో తచ్చిహ్నవర్యంబు ని
    ల్చును సర్వోత్తమమైన సాక్ష్యమగుచున్ శోభాయమానమ్ముగా

    రిప్లయితొలగించండి
  5. కాకతీయ సామ్రాట్టుల కళల ప్రేమ
    చిహ్నమీ శిల్ప రాజము చెలువ మొప్పు
    రమ్ము నను జూడ సోదరా రమ్మ టంచు
    తలుపులను దెరచి స్వాగతం బలుకుచుండె.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గురువులకు, పెద్దలందఱికి
    ప్రణామములు!

    ఏకశిలా మహాప్రాకార రక్షణ
    శ్రీకారమంత్రమై చెలఁగు దీక్ష
    మ్లేచ్ఛవాహినులను మేదింప గణపతి
    దేవుండు దూసిన తెలుఁగు కత్తి
    రణముల సురతాణి గణముల గుణమూడ్చు
    రాణి రుద్రమదేవి పాణిశక్తి
    జాయప సేనాని సాయించు ధీ మించు
    భరతవిద్యాప్రౌఢభావగరిమ

    పాడుకొందును గళమెత్తి పాటవింప
    “కాఁక” లేని “తీయఁ”దనము గండరించు
    కాకతీయాంధ్రసామ్రాజ్యకమ్ర కీర్తి
    తోరణముఁ గాంచి పులకించి దోయిలించి.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  7. ఏకశిలా తోరణ మది
    ఏకైకంబుగ వెలుంగు నెప్పటికిని వ
    త్సా! కాకతీయ రాజుల
    శ్రీకీర్తిని చాటెడి ఘనచిహ్న౦ బదియే!

    రిప్లయితొలగించండి
  8. మార్కొ పోలొ యాత్ర పేర్కొనె విభవమ్ము
    కాకతీయ ఘనత కనుల కింపు
    గుడులు గోపురములు బడులు మెండుగ నున్న
    శిల్ప కళల సొగసు శ్రీ కరమ్ము

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, డిసెంబర్ 21, 2012 8:18:00 PM

    భీషణ రణ ఘోష లుషిత శిలాతోర
    ణమ్ము తీర్థ మయ్యె నల్దిశలకు
    కాకతీయ కళల కావ్యమై సర్కారు
    చిహ్న రుచిర మగుచు చేవ తోడ.

    రిప్లయితొలగించండి
  10. కాకతీయుల కీర్తి తోరణాన్ని చూసి స్పందించి మనోహరమైన పద్యాలు రచించిన...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. ఆంధ్ర దేశ మెల్ల అవలీలగానేల
    కూడు గుడ్డ గూడు కొదువ లేక
    సాక్షి కంబ ద్వార స్వాగత తోరణం
    కాకతీయ వంశ ఖ్యాతి మెరయ

    రిప్లయితొలగించండి