5, ఆగస్టు 2012, ఆదివారం

పద్య రచన - 72


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. దేవుని జేరుట కొఱకై
    పావనమగు నవవిధముల,భక్తిని- గాన
    మ్మవధారణజేసి కొనుచు
    నవలీలగ ముక్తిబొందుటద్భుతమనెదన్.

    రిప్లయితొలగించండి
  2. ఎమ్మెస్సనగాపాటల
    యమ్మేకదయామెవాణియవతారమ్మే
    మమ్మందరినినెదోలో
    కమ్మునకుగొనిచనుస్వీయగానప్రతిభన్

    రిప్లయితొలగించండి
  3. పార వశ్యము జెం దగ పాట పాడి
    సుబ్బ లక్ష్మమ్మ పేరున సొబగు నొందు
    గాన కోకిల వీవమ్మ గగన తార !
    అందు కోవమ్మ !వందనా లందుకొనుము

    రిప్లయితొలగించండి
  4. నాపద్యము నాలుగవ పాదము సవరణతో
    నవలీలగ ముక్తిబొందనద్భుతమదియే!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    గొంతు దాచిన యమృతమ్ముఁ గురియఁ జేసి,
    పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
    మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
    సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!

    రిప్లయితొలగించండి
  6. విందును వడ్డిం చగ గో
    విందుని నామామృ తమ్ము వేవిధములుగా
    అందిన వారే ధన్యులు
    వందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!

    రిప్లయితొలగించండి
  7. అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
    మీ పద్యము 4వ పాదములో ప్రాస నియమము పాటించలేదు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  8. విందును వడ్డిం చెను గో
    విందుని నామామృ తమ్ము వేవిధములుగా
    అందిన వారే ధన్యులు
    వందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!

    రిప్లయితొలగించండి
  9. ఎలదేటిపాటలనెనయించితివినీవు
    సంబరంబులుదాటెనంబరముల,
    శ్రీవేంకటేశుకీర్తీవిభవముల్దెల్పి
    భక్తిభావంబు సంప్రాప్తిజేసి,
    శోభాయమానమౌసుప్రభాతముపాడి
    జగతినేమేల్కొల్పు మగువనీవు,
    సన్మానముల్ పురస్కారంబులన్ బొంది
    విఖ్యాతకీర్తులన్ వెల్గితీవు,

    భరతజాతికి పుట్టిన పసిడికొమ్మ,
    భక్తిసంగీత రాజ్యాన పట్టమహిషి,
    నిత్యనూతన సంగీత నిధివినీవు,
    వందనంబులజేతునోస్వరవిహారి.

    ( స్వరవిహారి = ఎక్కడ సంగీతముంటుందో అక్కడ ఆమె గానము ఉంటుంది కదా అనే అర్థములో ).

    రిప్లయితొలగించండి
  10. శ్రీనేమని గురువర్యులకు వందన శతమ్ము. తమరి అమూల్యమైన సూచనకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
    ద్వాపరయుగంపుకృష్ణుని
    గోపిక గాకున్న గాన కోకిళ తానై
    తీపిగ హరినామమ్మా
    లాపించతరమ్మె?సుబ్బలక్ష్మీమణికిన్!

    రిప్లయితొలగించండి
  11. విశ్వ మంతట వినిపించు శాస్వ తముగ
    సత్క రించిరి పలురీతి సౌరు కురియు
    సుస్వ రమ్ముల మధురిమ సుబ్బ లక్ష్మి
    దైవమును మేలు గొలిపెడి ధన్యు రాలు !

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులారా,
    ఎమ్మెస్. సుబ్బలక్ష్మి గారిపై అద్భుతమైన పద్యాలను వ్రాసిన
    లక్ష్మీదేవి గారికి,
    కమనీయం గారికి,
    సుబ్బారావు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి