12, సెప్టెంబర్ 2010, ఆదివారం

చమత్కార పద్యాలు - 21

దశావతార స్తుతి - 5 (వామనావతారం)
మ.
స్వతలస్వచ్చతరారుణత్వ రచితస్వస్త్రిః పరేడ్భ్రాంతి వా
క్ప్రతికూలత్వ దశానుకారి గళగాద్గద్యక్షమాంభోజ భూ
నుతి హాసన్నఖరోర్ధ్వ సారిత పదార్ణోరుడ్జ గంగాసవా
ప్రతిమాళీశ కపర్ద మండల వటుబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17వ శతాబ్దం)
భావం -
వామనావతారుడవైన ఓ పరమాత్మా! నీ పాదపద్మం చాలా ఎఱ్ఱగా ఉండడం చేత బ్రహ్మ శరీరచ్చాయ మారిపోగా, సరస్వతి ఇతడు నా భర్తా? లేక పరస్త్రీ భర్తా? అనే సందేహం ఉండడం చేతనా అన్నట్లు నిన్ను స్తుతించడానికి ప్రయత్నించిన బ్రహ్మ మాట గద్గదం అయిపోయింది. అది చూచి నీ గోళ్ళు నవ్వుతున్నాయా అన్నట్లున్నది. అలాంటి ఊర్ధ్వ ప్రసారితమైన నీ పాదం మీద గంగ మకరందం వలె - అనగా ఈశ్వర జటాజూట స్థానీయమైన ఆకాశం- తుమ్మెద వలె ఉన్నది. అలాంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి