12, సెప్టెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 93

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రొయ్యల పులు సడిగె నయ్యవారు.

4 కామెంట్‌లు:

  1. నెయ్యి పప్పు పులుసు నియతిగ తినినేను
    చప్ప బడితి నయ్య చెప్పు కొనక
    ముక్క లేవొ తెచ్చి మక్కువగ తినబెట్ట
    రొయ్యల పులుసడిగె నయ్య వారు .

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి నేదునూరి గారూ,
    నిర్దోషంగా చక్కని పూరణ పంపించారు. బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నా పూరణ ..........

    పూజ సేయు మనుచు పూజారి నడుగగా
    "దైవ పూజలోన తప్పనిసరి
    త్రికరణముల శుద్ధి; తిని వచ్చితివ నీవు
    రొయ్యల పులు" సడిగె నయ్యవారు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ శుభాకాంక్షలండీ! మూడునాలుగు రోజులుగా పండగ శలవల్లో ఉన్న కారణంగా పూరణలు చేయలేదు..ఇవాల్టి సమస్యకోసం ఎదురు చూస్తున్నాను.

    రిప్లయితొలగించండి