16, జనవరి 2012, సోమవారం

నేమాని వారి పద్యం

                        పండువు మెట్లు
సీ.
భోగేఛ్ఛలను వీడి భోగి మంటలలోన
           కర్మ వాసనలను కాల్చి వేసి
ఉత్తరాయణము సద్యోగప్రదంబని
           సమ్మతి సంక్రాంతి సరణి నూని
సమదృష్టితో సకలము బ్రహ్మమయమని
           కనుమ ప్రశాంతి సౌఖ్యముల నట్లు
మూడు పండువులును ముక్తిధామమునకు
           సోపానములగును సుకరముగను

ఆ.వె.
హంస వోలె నెపుడు నన్ని సందర్భాల
పాలనే గ్రహించి మేలు దలచి
నీతి మార్గమందు నిత్యసంతోషివై
మనుము భద్రములను గనుము వేడ్క

                                                 రచన         
                    శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు




2 కామెంట్‌లు: