20, నవంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 166

అమెరికాలో తెలుగు సైన్‌బోర్డ్
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. తెలుగు గడ్డ మీద తెలుగును వాడరు
    బడులనేని తెలుగు పలుక రాదు
    బళి! ప్రవాసములనె తెలుగు సంస్కృతి చాల
    మెరుగులొందుచుండె మేలు మేలు

    రిప్లయితొలగించండి
  2. తెలుగు భాష నిటుల వెలుగు "నట్టు"ల జేసి
    పరుల దేశ మందు పాటు బడెడి
    తెలుగు వారి జూచి తెలివి దెచ్చుకొనుచు
    తెనుగు వెలుగ నిమ్ము తెలుగు నేల.

    రిప్లయితొలగించండి
  3. దూరముననున్న వారికి
    మీఱిన ప్రేమను, తెలుగది మేలని తోచున్,
    చేరువలోనున్న ప్రజకు
    దూరపు భాషలు సులువుగ తోచును సుమ్మా!

    రిప్లయితొలగించండి
  4. పెసరట్టు సైను బోర్డును
    చూసితి మఱి యమెరికా లొ చూసితి యింకా
    యాసలు నట చిగి రించెను
    బాసను మన తెనుగు చూసి బళిరా యంటిన్ .

    రిప్లయితొలగించండి
  5. ఓ సుబ్బారావార్యా!
    ప్రాసను విడిచితిరి మొదటి పాదములోనన్
    కాసింత ధ్యానముంచ సె
    బాసందురు కాదె కంద పద్యమును సుధీ!

    రిప్లయితొలగించండి
  6. పెసరట్టల్లముచట్నీ
    కొసరికొసరిపెట్టువారుకొరవడునచటే
    యసలైనతెలుగువారల
    పెసరట్టంగడిమనోరిపెన్నిధికాదే?

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము
    ======*========
    పెసలు రట్టు జేయ పెసరట్టు యగు,నేడు
    పేరు బెట్ట తెలుగు వారు తెలుగు
    వెలుగు తేజ రిల్లె,వేష భాషల తోడ
    దశదిశలకు,జెప్ప వశము గాదె

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యములో "మనోరి" ప్రయోగమును మార్చితే బాగుంటుంది. మనకొక అందామా?

    రిప్లయితొలగించండి
  9. వలస వచ్చిన జనులంత తెలుగు వారు
    కోటి లింగాలు వెలసిన పూట కూళ్ళు
    కనగ దోసెలు పెసరట్టు తినగ నేడు
    అమిత ప్రీతిగ రుచు లందు నమెరి కనులు !

    రిప్లయితొలగించండి
  10. తెలుగు మాటాడ కున్నను వెలుగు నిచట
    తెలుగు సంస్కృతి యన్నను విలువ మెండు
    ఉల్లి పెసరట్టు దోసెలు యుల్ల మలర
    దేశ దేశాల రుచులను తినగ దొరలు
    అనుక రింతురు మనలను కినుక లేక !

    రిప్లయితొలగించండి
  11. దేశంకాని దేశంలో తెలుగు సైన్‌బోర్డ్ చూసి ఆనందించి, గర్వించి, ఇక్కడి వారి ఉపేక్షకు చింతించి, కర్తవ్య బోధన చేస్తూ వైవిధ్యంగా పద్యాలను రచించిన కవి మిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    వరప్రసాద్ గారికి,
    ‘ఓం సాయి కన్‌స్ట్రక్షన్’ రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    సుబ్బారావు గారూ,
    పండిత నేమాని వారు చెప్పినట్టు ప్రాస దోషమే కాకుండా మీ పద్యంలో మరికొన్ని లోపాలున్నాయి.
    ‘చూచితి’ ని చూసితి అన్నారు. ‘ఇంకన్’ అనవలసిన చోట ఇంకా అన్నారు. ‘చిగురించెను’ను ‘చిగిరించెను’ అన్నారు.
    *
    సహదేవుడు గారూ,
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    అక్కయ్యా,
    ‘నేడు + అమిత’ అన్నచోట సంధి నిత్యం కదా. అక్కడ ‘నేటి కమిత’ అందాం.

    రిప్లయితొలగించండి
  12. మేటి బర్గరు పిట్జాను మించిపోయి
    పిట్సు బర్గులో పెసరట్టు పేరు బడసె
    అతి రుచిగ నుండు భక్షింప నాంధ్రు లకిది
    అమెరికన్లును వలెనని యడుగుదురట

    రిప్లయితొలగించండి
  13. మా ఇంట్లో ఇది మామూలే:
    సరదా సరదా పెసర
    ట్టు రుచి భలేర పెసరట్టు, టోకున నుప్మా
    కరిగిన నేతిన్ జేరిచి
    అరడజనైనఁ దిని చూడరా తెలుగోడా!

    రిప్లయితొలగించండి