27, మార్చి 2014, గురువారం

ప్రహేళిక - 52 (సమాధానం)

ఎవరా ప్రభువు?
ఆ.వె.
తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.

(‘నానార్థ గాంభీర్య చమత్కారిక’ గ్రంధం నుండి.)

సమాధానం
ఆ.వె.
తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి