3, నవంబర్ 2012, శనివారం

పద్య రచన - 149

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. వరదలు పొంగెను పొరిలెను
    బురదయు, నీరాయె నూరు పొగిలెను గుండెల్
    సరి పూరి గుడిసె వాసుల
    కరి వరదా కావుమయ్య కారుణ్యముతో.


    రిప్లయితొలగించండి
  2. చెరువయ్యె నూరు గూడును
    కరవయ్యెను తిండి నీరు గతిదప్పి కటా
    బరువయ్యెను జీవితములు
    వరదలు శాపమ్ములయ్యె వరదా కనవే?

    రిప్లయితొలగించండి
  3. పేదల బ్రతుకుల పాలిట
    ఈదరి వరదలను ముంచ యేగతి కడకున్ !
    వేదన శాపము గాకిది
    ఆదరణకు నోచనట్టి యాకలి బ్రతుకుల్ !

    రిప్లయితొలగించండి
  4. అగ్నికాకలైనంతనేయారగించు!
    గాలిభీభత్సరూపమ్ముకప్పులేపు!
    వర్షమాగ్రహించినగూడువరదపాలు!
    పంచభూతాలుపగబట్టిబ్రతుకుకుదుప
    గుడిసెవాసులకెంతటిగుండెకోత!

    రిప్లయితొలగించండి
  5. వరదలు వచ్చిన యె డ లన
    కరువే మఱి సంభవించి కాటికి పంపున్
    వర దు డ ! శ్రీకర ! శుభకర !
    వరద లు లేకుండు న టు లు వరమును నిమ్మూ !

    రిప్లయితొలగించండి
  6. వరదలతో సహ వచ్చును
    బురదలు వ్యాధులు కరువులు పురములు మునుగున్
    వరిచేలు చెఱువు లగుచున్
    మరణములును గల్గ వచ్చు మనుషుల కపుడున్.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. వరదల మూలంగా కలిగే కష్టాలను వివరిస్తూ చక్కని పద్యాలు ఒకరిని మించి ఒకరుగా వ్రాసిన...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    సహదేవుడు గారికి,
    సుబారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
    =======*=======
    నీరు జిక్కక జనులు కన్నీరు ద్రాగు
    చుండ గరుణించిన వరుణు డండగ నిలు
    వ కడు సన్నగిల్లి నదులు బరుగు బెట్టె
    నింటి చుట్టు , నిడుమలెల్ల పంటి గ్రింద

    బెట్టి దిరుగు చుండెను నేడు పట్టె డన్న
    మున ను గోరి కర్షకులెల్ల పురము నందు,
    పంచ దార బల్కుల్ బల్కు పాలకులు వ
    రదను గని ,నిల్చె నీడ జాలనెడి వారు |

    రిప్లయితొలగించండి