13, మార్చి 2013, బుధవారం

పద్య రచన – 279 (గోధూళి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"గోధూళి"

26 కామెంట్‌లు:

  1. గోవుల గాచుచు నుండెడి
    గోవిందుని పాదధూళి, గోధూళిని సద్
    భావముతో దలదాల్తురు
    దేవతలవె కామితములు దీర్చునటంచున్

    రిప్లయితొలగించండి
  2. గోవుల దేహమునందున
    దేవతలే నిలచియుంద్రు దివ్యములేగా
    గోవుల మూత్రము పేడయు
    గోవుల క్షీరమ్ము నటులె గోధూళియుగా.

    రిప్లయితొలగించండి
  3. సకల దేవతా మూర్తుల సన్నిథైన
    గోవుఁ బూజించ శుభములుఁ గూరు మిగుల
    పరమ పావన గోధూళి పురము నందు
    మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె!
    (గోవధ కారణంగ మరియు వ్యాపార దృష్టి పెరగటం వల్ల గోవులు తగ్గి పోయాయి. ఇక గోధూళి ఎక్కడ?)

    రిప్లయితొలగించండి
  4. సహదేవుడు గారూ,
    "సన్నిధి + ఐన" అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "సన్నిధి యగు" అంటే సరి.

    రిప్లయితొలగించండి
  5. గోవులు నడిచెడి పథమున
    గోవుల మూ త్రంబు లుండు , గో పే డ యు నున్
    గోవులు నడవగ ధూ ళియు
    బావన ముం జేయు మిగుల పరిసర గృహము న్

    రిప్లయితొలగించండి
  6. కవులు గోధూళి వేళల కవనమందు
    వర్ణనలఁ జేయ రమ్యమా వైభవమ్ము;
    చదివి నారమే యూహల జగతిలోనఁ
    గాంచి, నిల్చె నేడునదియె కన్నులందు.

    రిప్లయితొలగించండి




  7. కోరుకున్న గూడ గోధూళి కనరాదు
    పల్లెలందు నిండె బస్సుధూళి
    పట్టణాల మాట పరమాత్ముడెరుగును
    ఎచట నైన నద్ది యెండమావి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు, ఎందుకో యతి మైత్రి నావల్ల కాదని వృత్తమును మార్చితిని.
    శ్రీ కమనీయం గారి " గోధూళి " "బస్సుధూళి " మరియు " యెండమావి" . అద్భుతం

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    =======*=======
    నోరూరగ దినగ కసుపు నూలు పరక లేదు,గడ్డి
    సారము దెలియంగను ఘన సారమ్ము వలె దిను చుండె
    గౌరవనీయులవనిని,గడ్డి మొలక లేక గోవు
    దూరమాయె మనుజుల పెడ దోరణి మారక, గనును
    పౌరులు గోధూళి చిత్ర పటములు పత్రిక లందు
    ( కసుపు=గడ్డి )

    రిప్లయితొలగించండి
  10. కసువు =గడ్డి, గాదం, గాసం [తెలంగాణ మాండలికం]

    రిప్లయితొలగించండి
  11. కొండను మేత మేసి తమ గోవుల మందలు పల్లె వైపు బో-
    చుండగ వాని గిట్టలను జోరుగ రేగిన ధూళి మాటునన్
    వెండి మొగిళ్ళ దాగు నిశివెల్గన గోవుల వెన్క నల్లదే
    కొండను గోట నెత్తు చిన గోప కుమారుడు వెల్గు జూడరే!

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి ధన్యవాదములు. తమరి సూచన ప్రకారము సవరించిన పద్యం:
    సకల దేవతా మూర్తుల సన్నిధియగు
    గోవుఁ బూజించ శుభముచే కూరు మనకు
    పరమ పావన గోధూళి పురము నందు
    మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె!

    రిప్లయితొలగించండి
  13. విందు కనులకు గోధూళి వేళ లందు
    గగన మందున సూరీడు సొగసు లలర
    గుబురు కొను కొంగ బారులు గూడు చేరు
    మలయ మారుత వీచిక మదిని మురియ !

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి పద్యరచన అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కమనీయం గారికి,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. పశ్చిమాద్రినినుడు పవళింప వెడలంగ
    ………. నీరజారాతిని నింగి జూడ
    చిరుకాంతులుండంగ చిరుతలు గెంతుచు
    ………. చిరునవ్వులొల్కుచు చిందులెట్ట
    యింటి ముఖముపట్టి యిగిలింత లెట్టుచు
    ………. గోవులనదలించి గోలచేయు
    కమ్మని వాసనల్ క్రమ్మగ గోధూళి
    ………. గొప్పచిత్రమనగ గోచరించు

    పల్లె సీమల యందలి వైభవంబు
    నాడు యుండెను నేడెందు చూడ తరమె
    యాధునిక పద్ధతులనగ యాలమంద
    శాల యందున మేపంగ చతురమతులు.

    రిప్లయితొలగించండి
  16. కొండను మేత మేసి తమ గోవుల మందలు పల్లె వైపు బో-
    చుండగ వాని గిట్టలను జోరుగ రేగిన ధూళి మాటునన్
    వెండి మొగిళ్ళ దాగు నిశివెల్గన గోవుల వెన్క నల్లదే
    కొండను గోట నెత్తు చిన గోప కుమారుడు వెల్గు జూడరే!

    గౌరవనీయులైన మిస్సన్న మహోదయ!
    మీ పద్యం మనోఫలకం పై వ్రేపల్లె నాథుని గోచరింపచేసింది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. నగరమ్మునకు గల్గు నాల్గుదిక్కులలోని
    ................................పల్లెలన్నియు జేరె పట్నమందు
    ఆకాశహార్మ్యములందమెంతో పెరిగె
    ................................కాలిడుటకు దారి కానరాదు
    ధూళి తెచ్చు మనకు దోషమెంతోయని
    .................................కాంక్రీటు చేసిరి కాలిబాట
    హాలికులెందరో హలము పట్టగలేక
    .................................ఆత్మహత్యల వెంట నడుగులిడిరి

    ఇట్టి మారుపులెదురయ్యెనిలను నేడు
    అమ్ముచుండిరి గోమూత్రమంగడలను
    ఎక్కడగపడు గోధూళి నెంచి చూడ
    చిత్రపటముల చూడుడు చిత్రమెరయ.

    రిప్లయితొలగించండి
  18. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగారు,
    మా మనసులను ఇహానికి తీసుకెళ్తున్నారు అనుకొంటె, మళ్ళీ పరానికి లాక్కొచ్చారు. పద్యం బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. మనోహరమైన సీసపద్యాలను రచించిన కవిమిత్రులు...
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ సీస పద్యములో వర్ణన బాగున్నది. తేటగీతి 2వ పాదములో నాడు + ఉండెను అనేచోట యడాగమము రాదు కదా. నాడు నెలకొనె అని మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. అమ్మా! శ్రీమతి ప్రభల రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
    మీ సీస పద్యము బాగున్నది. టైపు పొరపాట్లు వంటివి చాల దొరలినవి.
    1. హార్మ్యము
    2. అందమెంతో (అందమెంతొ అంటేనే గణములు సరిపోవును)
    3. అంగడలను
    4. చిత్రమెరయ (చిత్ర మరయ అని ఉండాలి అనుకొంటాను).
    అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. నగరమ్మునకు గల్గు నాల్గుదిక్కులలోని
    ................................పల్లెలన్నియు జేరె పట్నమందు
    ఆకాశహర్మ్యములందమెంతొ పెరిగె
    ................................కాలిడుటకు దారి కానరాదు
    ధూళి తెచ్చు మనకు దోషమెంతోయని
    .................................కాంక్రీటు చేసిరి కాలిబాట
    హాలికులెందరో హలము పట్టగలేక
    .................................ఆత్మహత్యల వెంట నడుగులిడిరి

    ఇట్టి మారుపులెదురయ్యెనిలను నేడు
    అమ్ముచుండిరి గోమూత్రమంగడులను
    ఎక్కడగపడు గోధూళి నెంచి చూడ
    చిత్రపటముల చూడుడు చిత్రమరయ.

    పండిత గురువర్యులకు వందనములు. మీ సూచనలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. అమ్మా రామలక్ష్మి గారూ! ధన్యవాదాలు. మీ పద్యాలు కూడా మంచి పద గుమ్ఫనతో చక్కటి భావాలతో మనసును ఆకట్టుకొంటూ ఉంటున్నాయి.

    అయ్యా శర్మగారూ! మీరన్నది నిజం. మా చిన్నతనంలో మా ఊరిలోనూ, కాట్రేనికోన ఉన్నత పాఠశాల నుంచి మా ఊరు వచ్చే దారిలోనూ, ఆ గోధూళి వాతావరణం మనోహరంగా ఉండేది .ఇప్పటి మనకూ, పిల్లలికీ ఇవేవీ కూడా అందని ద్రాక్షలే. చక్కటి పద్యం వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  24. శ్రీ వరప్రసద్ గారికి ధన్యవాదాలు.మీ పూరణలు కూడా ఫాలో అవుతున్నాను.విలక్షణం గా ఉంటూ అలరిస్తున్నాయి.




    .

    రిప్లయితొలగించండి
  25. పూజ్యశ్రీ నేమాని పండితులకు నమస్సులు. మీ సవరణానంతరం
    పశ్చిమాద్రినినుడు పవళింప వెడలంగ
    ………. నీరజారాతిని నింగి జూడ
    చిరుకాంతులుండంగ చిరుతలు గెంతుచు
    ………. చిరునవ్వులొల్కుచు చిందులెట్ట
    యింటి ముఖముపట్టి యిగిలింత లెట్టుచు
    ………. గోవులనదలించి గోలచేయు
    కమ్మని వాసనల్ క్రమ్మగ గోధూళి
    ………. గొప్పచిత్రమనగ గోచరించు

    పల్లె సీమల యందలి వైభవంబు
    నాడు నెలకొనె నేడెందు చూడ తరమె
    యాధునిక పద్ధతులనగ యాలమంద
    శాల యందున మేపంగ చతురమతులు.

    సాహిత్యాభిమాని గారికి, అన్న మిస్సన్న గారికి ధన్యవాదములు. చిన్ని తనంలో తాపేశ్వరంలో ఉన్నప్పుడు నేనుకూడా ఆవులను తోటి పిల్లవాండ్రతో సరదాగా అదిలించుచూ వచ్చే వాడిని. చిన్నితనపు రోజులు ఎవ్వరికైనా స్వర్ణయుగమనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి