16, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 147 (ప్రహేళిక సమాధానం)

గంగాయాం స్నాతు ముద్యుక్తా
ఏకోనా వింశతి స్త్రియః
|
తత్త్రైకా మకరగ్రస్తా
పునర్వింశతి రాగతా
||

 సమాధానం -
గంగలో స్నానం చేయడానికి ఒక పురుషుడు (ఏకః + నా), ఇరవైమంది (వింశతి) స్త్రీలు మొత్తం ఇరవైయొక్కమంది సిద్ధపడ్డారు. అందులో ఒకరిని మొసలి తినగా ఇరవైమంది తిరిగి వచ్చారు.

ఏకోనా వింశతి స్త్రియః .....
ఏక + ఊనా వింశతి స్త్రియః = ఒకటి తక్కువ ఇరవై (పందొమ్మిది) మంది స్త్రీలు.
ఏకః + నా = ఒక పురుషుడు, వింశతి స్త్రియః = ఇరవై మంది స్త్రీలు.


జిలేబీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు సరియైన సమాధానాలు తెలిపారు. అభినందనలు.
శ్యామల రావు గారు, పండిత నేమాని వారు చమత్కారంగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు.
ఇంకా గోలి హనుమచ్ఛాస్త్రి గారు, సుబ్బారావు గారు, లక్కాకుల వెంకట రాజారావు గారు ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.

అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి