10, జులై 2014, గురువారం

పద్యరచన - 616

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. గుహుడు మ్రొక్కెను రాముని బహుళ ప్రీతి
    నదిని దాటించ గోరుచు పదిల ముగను
    కల్లు కడవలు నదికీయ కలికి సీత
    నూరి జనులెల్ల కదిలెను వారి వెంట

    రిప్లయితొలగించండి
  2. దరిజేరిన మరి నీవే
    దరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య
    ద్దరిజేర్చగ రమ్మని నీ
    దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ !

    రిప్లయితొలగించండి
  3. దరిజేరిన మమ్ములనే
    దరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య
    ద్దరిజేర్చగ రమ్మని నీ
    దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ !

    రిప్లయితొలగించండి
  4. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నిన్న సాయంత్రం నుండి కొద్దిగా అస్వస్థత.. అందువల్ల నిన్న ఆలస్యంగా వచ్చిన పద్యాలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.. ఇప్పుడు వ్యాఖ్యానించాను. చూడండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘అందరినీ దరిజేర్చే మారాజువే... అద్దరిని జేర్చమని అడుగుతుండావే’ అన్న పాటలోని భావాన్ని చక్కగా ఛందోబద్ధం చేశారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పరవశ మొందితి రామా!
    దరిశన భాగ్యంబు నొసగి దరిజేర్చ మనన్!
    గిరి రాతిఁ బడతి జేసిన
    సురనుత! నీ కాళ్లఁ గడుగు సూనృత మిమ్మా!

    రిప్లయితొలగించండి
  6. సహదేవుడు గారూ,
    ‘రాతిని నాతిని చేసిన నీ పాదం తగిలితే నా నావ ఏమవుతుందో.. కాళ్ళు కడగనీ’ అన్న భావాన్ని చక్కని పద్యం మలిచారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. అడుగిడకాగుము రఘువర
    పడవగునో యే అతివగ పదమీవిడినన్
    కడిగెద పాదములని వడి
    వడిగావచ్చె గుహుడటకు వందనమిడుచున్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
    నారాధించితి నీదు దర్శనముకై యానంద ముప్పొంగె నో
    వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
    ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నాపై ప్రభో !

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    రాతిని తన పదధూళితో నాతిఁ జేసె
    రాము వలన తన పడవ కేమి యగునొ
    యంచు తలపోసి తనయొక్క యాత్మలోన
    కాళ్ళు కడిగెను గుహుఁడు తా కరము భక్తి.

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ధారాశుద్ధితో చక్కగా సాగింది మీ పద్యం. అభినందనలు.
    ‘దర్శనముకై’ అనరాదు. దర్శనమునకై అని ఉండాలి. అక్కడ ‘దర్శనముతో నానంద ముప్పొంగె’ అందామా?
    చివరి పాదంలోని ‘నాపై’ శబ్దానికి అన్వయం? అక్కడ ‘నా నావపై’ అంటే సరిపోతుందనుకుంటాను.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు

    మీరన్నట్లు 'దర్శనమునకై' అని యుండవలసి యుండెను కాని తప్పినది. మీ సవరణకు ధన్యవాదములు

    దాటింతును + ఆ పై , ' ఆ పై' అను పదము 'అటు తరువాత' అను భావముతో వ్రాశాను . మొదట పాదార్చన పూలతో జేసి గంగానదిని (ఆ పైన) ఆ తరువాత దాటిస్తాను అనుభావము నూహించి వ్రాశాను . మీ అభిప్రాయము తెలియ జేయ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  12. శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
    నారాధించితి నీదు దర్శనముతో యానంద ముప్పొంగె నో
    వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
    ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
    నారాధించితి నీదు దర్శనముతో నానంద ముప్పొంగె నో
    వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
    ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ భావన యుక్తమైనదే.. ‘దాటీంతు నాపైఁ బ్రభో’ అని ఉంటే సందేహానికి ఆస్కారం ఉండక పోయేది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి